పంజాబ్, మార్చ్ 16: పంజాబ్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో తన ఇద్దరి బాయ్ఫ్రెండ్స్ని ఇంటిక రమ్మని పిలిచింది. అదే సమయంలో అనుకోకుండా భర్త ఇంటికొచ్చాడు. ఒక్కసారిగా బిత్తరపోయిన భర్త భార్య బండారం మొత్తం తెలుసుకొని భార్యతో పాటు ఇద్దరు ప్రియుళ్లను చావ బాదాడు. పూర్తి వివరాల ప్రకారం...పంజాబ్లోని ఓ ఇంట్లో నూతనంగా వివాహమైన భార్య భర్తలు నివాసముంటున్నారు. అయితే ఒక రోజు భర్త ఇంట్లో లేని సమయం చూసి భార్య తన ఇద్దరి బాయ్ఫ్రెండ్స్ని పిలిపించుకుంది. ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. ఆ ఇద్దరూ ఏదో విషయమై ఆమెతో గొడవకు దిగుతున్నారు. అదే సమయంలో తన భర్త అనుకోకుండా ఇంటికొచ్చాడు. వారిని అలాంటి స్థితిలో చూసిన భర్త కోపంతో ఊగిపోయాడు. బంధువులను, గ్రామస్థులను పిలిచి వారిని చితక బాదారు. అబ్బాయిలిద్దరినీ తాళ్లతో చేతులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు రెండు వర్గాలకు నచ్చజెప్పి గొడవను సద్దుమణిగేలా చేసారు. అయితే వీరిని కొట్టినప్పుడు చిత్రించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు ఇద్దరు అబ్బాయిలను మాత్రం అమ్మాయి పిలిచిందని, అందువల్లే తాము ఆమె ఇంటికి వెళ్లామని వారు చెబుతున్నారు.