రాజకీయాల లబ్ది కోసం బాబాయి ని కూడా వదలలేదు : టీడీపీ

SMTV Desk 2019-03-16 16:15:57  Chintamaneni, YSRCP,

అమరావతి, మార్చ్ 16: ఎప్పుడు వివాదాల్లో నిలబడే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ సారి కూడా మళ్ళీ అలాంటి వివాదానికి దారి తీసే వ్యాఖ్యలు చేసారు.నిన్ననే ప్రతి పక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వై ఎస్ వివేకానందా రెడ్డి అనుమానాస్పద మృతి ఎంతటి సంచలనానికి దారి తీసిందో అందరికీ తెలిసినదే..ఈ దుర్ఘటన విషయంలో ఇప్పటికే అధికార మరియు ప్రతి పక్ష పార్టీల శ్రేణులు ఇద్దరూ ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయి ఆరోపణలు చేసుకుంటున్న ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ విప్ చింతమనేని ప్రభాకర్ జగన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

జగన్ తన బాబాయ్ మరణాన్ని కేవలం తన రాజకీయ లబ్ది కోసమే వాడుకుంటున్నారని,అంతే కాకుండా కావాలని వారి పార్టీని ఈ సమస్యలోకి లాగుతున్నారని చింతమనేని అన్నారు.ఇలాంటి సమయంలో చనిపోయిన కుటుంబానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగా విచారణ చేయించి వారికి అండగా ఉండడం మానేసి రాజకీయంగా శవ రాజకీయం చెయ్యడం తగదని సంచలన వ్యాఖ్యలు చేసారు.మరి ఈ సందర్భంలో చింతమనేని చేసిన ఈ వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణులు ఎలాంటి సమాధాన్ని ఇస్తాయో చూడాలి.