బెంగళూరు, మార్చ్ 16: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నాటక నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య కోరారు. గతంలో అదే స్థానం నుండి ఇందిరా గాంధీ, సోనియా గాంధీలు పోటీ చేసి గెలిచారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ కి సిద్దరామయ్య ఓ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ప్రజలు ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నారని అందుకే రాహుల్గాంధీ కూడా కర్ణాటక నుంచి పోటీ చేయాలని ట్వీట్ చేశారు. 1978లో కర్ణాటకలోని చిక్కమగళూరు లోక్సభ ఉప ఎన్నికలో ఇందిరా గాంధీ, 1999లో బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి సుష్మాస్వరాజ్పై సోనియా గాంధీ పోటీ చేసి గెలిచారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ విషయంలో ఇది రుజువైందని ఆయనన్నారు.