అహ్మదాబాద్, ఆగష్ట్ 8: రాజస్థాన్ ఝాలావర్లో విషాద వాతావరణం అలుముకుంది. స్థానిక పార్వాన్ నదిలో బోటు ముంపుకు గురై, అందులో ఉన్న 15 మంది గల్లంతయ్యారు. వెంటనే రెస్క్యూ టీం కు సమాచారమివ్వగా, సహాయక చర్యలు చేపట్టి ఇప్పటి వరకు నలుగురిని రక్షించారు. మిగతా వారి కోసం రెస్క్యూ టీం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఇటీవల భారీ వర్షాలతో రాజస్థాన్లో చాలా నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.