9 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం

SMTV Desk 2017-08-08 11:06:45  Indin Navy, Tamilnadu, Srilanka Navy, Fisherman arrest

తమిళనాడు, ఆగష్ట్ 8: ఈ నెల 7వ తేదీన పాక్ జలసంధి ప్రాంతంలో శ్రీలంక నేవీ తొమ్మిది మంది భారత మత్స్య కారులను అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన రెండు పడవలను కూడా స్వాధీనం చేసుకుంది. కాగా, ఈ మత్స్యకారులు తమిళనాడులోని పుదుక్కొట్టై, నాగపట్నం జిల్లాలకు చెందిన వారిగా సమాచారం. విచారణ కోసం కంకేసాంత్యురై నావికా దళ శిబిరానికి మత్స్యకారులను తరలించినట్లుగా అధికారులు తెలిపారు. అయితే అరెస్ట్ చేసిన వారిని శ్రీలంక నావికాదళ పడవ P-439 లో శిబిరం దగ్గరకు తీసుకువెళ్లే సమయంలో ఇద్దరు మత్స్యకారులు కనిపించకుండా పోయారు. ప్రస్తుతం తప్పిపోయిన జాలర్లను వెతికే పనిలో నావికా దళం నిమగ్నమయ్యిందని, అలాగే అరెస్ట్ చేసిన మత్స్యకారులను విడిపించేందుకు శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడతామని భారత నావికా దళం తెలిపింది.