హైదరాబాద్, మార్చ్ 13: కాఫీ విత్ కరణ్ షోలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్ తాజాగా తన ర్యాంకుని మరింతగా మెరుగుపరచుకున్నాడు. జట్టులో చోటు కోల్పోయిన తరువాత మళ్ళీ భారత్-ఏ తరఫున ఆడి ఫామ్ అందుకున్నాడు. నిషేధం ముగిసిన తర్వాత జట్టులోకొచ్చిన రాహుల్ రెండు మ్యాచ్ల్లో రాణించి తాజా ర్యాంకింగ్స్లో ఐదో ర్యాంక్కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20ల సిరిస్లో కేఎల్ రాహుల్ వరుసగా 47, 50 పరుగులతో రాణించాడు. దీంతో తాజా ర్యాంకుల్లో అతడి స్థానం మెరుగైంది. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(699) ఒక స్థానం దిగజారి ఐదుకు పరిమితమయ్యాడు. ఇక, ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ఖాన్(780) నంబర్వన్ ర్యాంక్లో ఉన్నాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే పాకిస్థాన్ (135) టీమిండియా కన్నా 13 రేటింగ్ పాయింట్ల ఆధిక్యంతో తొలి స్థానంలో కొనసాగుతోంది. భారత్ (122), ఇంగ్లాండ్ (121) రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.