హైదరాబాద్, మార్చ్ 13: వివాదాల మాస్టర్ రామ్ గోపాల్ వర్మ నుండి వస్తున్న తాజా సంచలనం లక్ష్మీస్ ఎన్టీఆర్. కొద్ది రోజులుగా సినీ, రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రా న్ని నిలిపివేయాలని కోరుతూ.. ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రను నెగిటీవ్గా చూపించారని, ఎన్నికల టైమ్లో ఈ సినిమా ప్రభావం ఓటర్ల పై పడుతోందని, వచ్చే నెలలో ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపధ్యంలో, అప్పటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను నిలిపివేయాలని టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి తాజాగా ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ వ్యవహారం పై స్పందించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిజాన్ని ఎవరూ దాచలేరని, ఆ విషయం టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని ఆర్జీవీ సోషల్ మీడియా ద్వార స్పందించారు. కానీ ఎలాంటి అవాంతరాలు వచ్చినా తాను మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రకటించిన తేదీకే విడుదల చేస్తానని, అసలైన నిజాలు చూపుతుంటే.. టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ఇక ఈ ఫిర్యాదు పై ఎన్నికల కమీషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.