న్యూఢిల్లీ, మార్చ్ 12: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పూరి పార్లమెంటు స్థానం నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేయనున్నట్లు సమాచారం. మోదీ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి నియోజకవర్ఘం నుంచి పోటీపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే బిజెపి పార్లమెంటరీ బోర్డు కూడా మోది మరోసారి వారణాసి స్థానం నుంచే పోటీ చేసి అప్పటి విజయాన్ని రిపీట్ చేస్తారని ఆశిస్తుంది. ఐతే మరో నియోజకవర్గం కింద పూరిని ఎంచుకుంటారని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో మోది గుజరాత్ నుంచి వడోదర స్థానం నుంచి, వారణాసి నుంచి పోటీ చేసి రెండింట్లోను విజయం సాధించారు. 2014లో యూపిలో 80 పార్లమెంటు స్థానాలకుగాను, 71 స్థానాలు గెలుచుకుంది.