రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తా

SMTV Desk 2019-03-12 16:28:29  lagadapati,

అమరావతి, మార్చ్ 12: రాష్ట్రము రెండుగా విడిపోయిన తరువాత రాజకీయ సన్యాసం చేపట్టిన మాజీ ఎంపీ లగడపాటి, తాజాగా చంద్రబాబు తో కలవనున్నారని వచ్చిన వార్తలపై స్పందించిన ఆయన ‘నా రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తా.., ఏ పార్టీలో చేరను, వ్యాపారాలు చేసుకుంటా’నని స్పష్టం చేశారు. నేడు మీడియా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’నంటూ ప్రకటించిన ఆయన అదే మాటపై ఉంటూ అందరికి దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే… కాగా ఇప్పుడు ఏపీలో ఎన్నికలు దగ్గరవడంతో ఆయన తన రాజకీయ సన్యాసాన్ని వదిలేసి ఏదైనా పార్టీలో చేరి పోటీచేస్తారా అని చాలా పుకార్లు వచ్చాయి… కానీ ఇదివరకట్లాగే తన రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తానని చెప్పి అందరి నోర్లు మూయించేశారు.