ఎన్నికల బరిలో దూకుడు పెంచిన భార్య భర్తలు!

SMTV Desk 2019-03-12 16:08:32  loksabha elections, akhilesh yadav, samajvadi party, akhilesh yadav wife dimple yadav, ajanghad constituency, kanouj constituency

లక్నో, మార్చ్ 12: లోక్ సభ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థులపై ప్రత్యెక దృష్టి పెట్టాయి. ఈ సందర్భంలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పి) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ అజంగఢ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి అఖిలేష్‌ తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెయిన్‌పూరి నియోజకవర్గం నుంచి ములాయం పోటీ చేయనున్నట్లు ఇటీవలే ఎస్పీ తొలి జాబితాలో ప్రకటించారు. అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ కనౌజ్‌ నుంచి బరిలో ఉండనున్నారు. మొయిన్‌పూరిలో ఏప్రిల్‌ 23న, కనౌజ్‌లో ఏప్రిల్‌ 29న ఎన్నికలు జరగనున్నాయి. అఖిలేష్‌ తీవ్ర కసరత్తు చేసి అజంగఢ్‌ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తునన స్థానం కావడం, ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉండడం తనకు కలిసి వస్తుందని అఖిలేష్‌ అజంగఢ్‌ను ఎంపిక చేసుకున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.