హైదరాబాద్, ఆగస్ట్ 7 : ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కు బహిరంగ లేఖ రాశారు. తప్పు చేసినట్లు రుజువు కాకముందే క్షమాపణలు చెప్పడం ఎందుకు? అనవసరంగా క్షమాపణలు చెప్పి ప్రాధేయపడడం సిగ్గుమాలిన పని అంటూ ప్రశ్నించారు. ఫిల్మ్ ఛాంబర్, కొందరు తప్పు చేశారంటూ రాయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ ఛాంబర్ వైఖరిపై నోటీసులందుకున్నవారు వెంటనే స్పందించాలని కోరారు. ఇప్పుడు కనుక స్పందించకుండా ఉంటే ఫిల్మ్ ఛాంబర్ క్షమాపణలు చెప్పడం వల్లనే వదిలేశారనే అబద్దం అలాగే ఉండిపోతుందని లేఖ ద్వారా వర్మ తెలియజేశారు. కాగా డ్రగ్స్ కేసులో భాగంగా 12 మంది సినీ ప్రముఖులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.