మార్చ్ 11: దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన సోషల్ మీడియా యాప్ గూగుల్ ప్లస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా గూగుల్ ప్లస్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గతంలోనే ఈ మేరకు పలు ప్రకటనలు చేసిన ఈ సంస్థ.. ఈ సారి ఏప్రిల్ 2వ తేదీ నుంచి జీప్లస్ సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనిలో ఉండే ఓ ప్రైవసీ బగ్ వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించిన గూగుల్ ప్లస్ యాజమాన్యం, అందులో ఉన్న యూజర్స్ డేటా మాత్రం ఎక్కడికీ పోదని హామీ ఇచ్చింది. స్టోరేజ్లో భద్రపరుచుకున్న ఫొటోలు, వీడియోలను ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.