115మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు

SMTV Desk 2019-03-11 11:06:43  andhrapradesh assembly elections, tdp, chandrababu naidu, election commission of india

అమరావతి, మార్చ్ 11: ఏపీలో ఏప్రిల్ 11న జరగబోయే శాసనసభ ఎన్నికలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 115మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. మరో 60 మంది పేర్లను ఖరారు చేయవలసి ఉంది. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడినందున ఈ రోజు సాయంత్రంలోగా మరో 30మంది పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

టిడిపి తరపున శాసనసభకు పోటీ చేయబోతున ముఖ్య అభ్యర్ధుల వివరాలు:

1.చిత్తూరు జిల్లా: నారా చంద్రబాబునాయుడు (కుప్పం), పులవర్తి నాని (చంద్రగిరి), అమర్ నాధ్ రెడ్డి (పలమనేరు), నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (పీలేరు).....2.కృష్ణా జిల్లా: బోండా ఉమా (విజయవాడ సెంట్రల్), దేవినేని ఉమా(మైలవరం), వల్లభనేని వంశీ (గన్నవరం), కొల్లు రవీంద్ర(బందరు), దేవినేని అవినాష్ (గుడివాడ), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ)....3.తూర్పు గోదావరి జిల్లా: యనమల రామకృష్ణుడు (తుని), జ్యోతుల నెహ్రూ(జగ్గంపేట), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం).....4.పశ్చిమ గోదావరి జిల్లా: పితాని నాని (ఆచంట), చినతామనేని ప్రభాకర్ (దెందలూరు).....5.గుంటూరు జిల్లా: నక్కా ఆనందబాబు (వేమూరు), కోడెల శివప్రసాద్ (సత్తెనపల్లి), పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), ఆలపాటి రాజా (తెనాలి), దూళిపాళ నరేంద్ర (పొన్నూరు).....6.కడప జిల్లా: సతీష్ రెడ్డి (పులివెందుల), రామసుబ్బారెడ్డి (జమ్మల మడుగు), పి.నర్సింహారెడ్డి (కమలాపురం). కర్నూలు జిల్లా: అఖిలప్రియ (ఆళ్లగడ్డ), భూమా బ్రహ్మానందరెడ్డి (నంద్యాల)....7.నెల్లూరు జిల్లా: నారాయణ (నెల్లూరు అర్బన్), ఆదాల ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు రూరల్), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సర్వేపల్లి), బీద మస్తాన్ రావ్ (కావాలి), పాశం సునీల్ (గూడూరు).....8.అనంతపురం జిల్లా: నందమూరి బాలకృష్ణ (హిందూపురం), పరిటాల సునీత (రాప్తాడు), కాల్వ శ్రీనివాసులు (రాయదుర్గం), పల్లె రఘునాధ రెడ్డి (పుటపర్తి), పయ్యావుల కేశవ (ఉరవకొండ).....9.శ్రీకాకుళం జిల్లా: అచ్చెన్నాయుడు(టెక్కలి), కళా వెంకట్రావు (ఎచ్చెర్ల).....10.విజయనగర జిల్లా: సుజయ్ కృష్ణ రంగారావు (బొబ్బిలి).....11.విశాఖ జిల్లా: బండారు సత్యనారాయణ (పెందుర్తి)......13.ప్రకాశం జిల్లా: గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), కారణం బలరాం (చీరాల).