అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగేవరకు మా ఆందోళన ఆగదు!

SMTV Desk 2019-03-11 07:44:06  ayodhya case, supreme court, shivasena party, rss chief bhayyaji jhoshi

న్యూఢిల్లీ, మార్చ్ 10: అయోధ్య వివాదంఫై మరోసారి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీ. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగేవరకు తాము ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. ఈ వివాదంపై మధ్యవర్తిత్వంపై నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాద పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలా? వద్దా? అనే విషయమై ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వీలైనంత త్వరగా అయోధ్య వివాదంలో తీర్పు ఇవ్వాలని కోర్టును కోరుతామని స్పష్టంచేశారు జోషీ. అధికారంలో ఉన్న వ్యక్తులు రామ్ మందిర్ అంశంలో నిబద్ధతగానే వున్నారు. వారిపై తమకు ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు.