టోక్యో, మార్చ్ 10: జపాన్ వాయవ్య తీరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జపాన్ వాయవ్య తీరంలోని నైగటా, సడో దీవుల మధ్య చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో 80 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. సముద్ర జీవి పడవను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు జపాన్ కోస్ట్ గార్డ్ వర్గాలు తెలిపారు. పడవ ప్రమాదం జరిగిన సమయంలో 121 మంది ప్రయాణిస్తున్నట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది.