రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేటీఆర్

SMTV Desk 2019-03-11 07:09:48  Rahul gandhi, KTR

హైదరాబాద్, మార్చి 10: శనివారం సాయంత్రం కాంగ్రెస్ ఆధ్యర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిమోట్ తో నియంత్రిస్తున్నారని విమర్శించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గట్టిగా తిప్పికొట్టారు. రిమోట్ కంట్రోల్ తో ప్రధానులను, ముఖ్యమంత్రులను నియంత్రించడంపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కులు ఉన్న విషయం దేశమంతటికీ తెలుసని ఎద్దేవా చేశారు. తమ రిమోట్, భవిష్యత్ కేవలం తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఈరోజు కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ, "రాహుల్ గాంధీజీ.. ప్రధాన మంత్రులను, ముఖ్యమంత్రులను రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించడం కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేటెంట్ హక్కు అని దేశమంతటికీ తెలుసు. మీరు, బీజేపీ రాష్ట్రాలపై ఎంతగా పెత్తనం చేయాలని భావించినప్పటికీ, మా భవిష్యత్తు, మా రిమోట్ కేవలం తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉన్నాయి" అని ట్వీట్ చేశారు.