ప్రకాశం, మార్చ్ 10: గిద్దలూరు మండల కేంద్రంలోని లింగాపురంలో రాజేశ్వరి అనే యువతి ఈ రోజు ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రాజేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలిని స్థానిక పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం రాజేశ్వరి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.