దారుణమైన హత్యకు దారి తీసిన వివాహేతర సంభంధం

SMTV Desk 2019-03-10 13:39:03  East godavari , killed

తూర్పుగోదావరి, మార్చ్ 10: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం లో దారుణ సంఘటన చోటు చేసుకుంది .. వివరాల్లోకి వెళితే నిద్రలో ఉండగా ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఓ వ్యక్తిని కర్కశంగా హత్యచేశారు దుండగులు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్థానిక పోలీసుల కథనం మేరకు...గ్రామానికి చెందిన వెలిగట్ల వీరవెంకట సత్యనారాయణ (32) స్థానికంగా ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సత్యనారాయణ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. మారణాయుధాలతో అతనిని కిరాతకంగా నరికి చంపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సత్యనారాయణ వివాహేతర సంబంధం నెరపుతున్న మహిళ బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.