రేవంత్ రెడ్డి రాహుల్ సభకు గైర్హాజరు, కారణం....!

SMTV Desk 2019-03-10 10:28:51  Revanth Reddy, Rahul Gandhi, Public Meeting, Absent, Sabhitha Indhra Reddy, Congress

హైదరాబాద్, మార్చి 10: శనివారం సాయంత్రం శంషాబాద్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. రేవంత్ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ సభకు గైర్హాజరు కావడంపై నేతలు చర్చించుకుంటున్నారు. నిజానికి రాహుల్ గాంధీ సభల్లో రేవంత్ ముందు వరుసలో ఉండేవారు. అటువంటి రేవంత్ సభలో కనిపించకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక స్వాగత ఉపన్యాసంలో భాగంగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతలను ఆహ్వానిస్తూ రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. అయితే, ఆయనెక్కడా కనిపించకపోవడంతో నాలుక్కరుచుకున్నారు. రేవంత్‌తోపాటు మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్యలు కూడా సభకు గైర్హాజరయ్యారు. వీరు ముగ్గురు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.