మరో కీలక నేత వైసీపీ లోకి ... చంద్రబాబు కి షాక్ ..

SMTV Desk 2019-03-10 09:47:37  TDP, Chandrababu,

అమరావతి, మార్చ్ 10: ఆంధ్రప్రదేశ్ ల ఎన్నికలు దగ్గరవుతుండటంతో చంద్రబాబు కి దెబ్బమీద దెబ్బ పడుతుంది. చంద్రబాబు నమ్మిన నాయకులందరూ కూడా తనని వదిలివెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు టీడీపీ ని వదిలిన నేతలందరూ కూడా వైసీపీ లో నే చేరిపోయారు. తాజాగా మరో సీనియర్ నేత కూడా టీడీపీ ని వదిలి వైసీపీ లో చేరనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పట్టున్న సీనియర్ నేతగా పేరున్న పెద్దాపురంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు టీడీపీని వడిలో పనిలో ఉన్నారని సమాచారం. పెద్దాపురం టికెట్ ను ఆశించిన ఆయనకు చంద్రబాబు నుండి ఇప్పటికి కుడి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆయన టీడీపీ ని వదలనున్నట్లు సమాచారం.

పెద్దాపురం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హోమ్ శాఖను చూస్తున్న చినరాజప్ప ఉండగా, మరోసారి ఆయనకే టికెట్ ఖరారైంది. దీంతో కాస్త అసంతృప్తికి లోనైన బొడ్డు భాస్కర రామారావు చినరాజప్పకు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం టికెట్ ను ఇచ్చి, తనకు పెద్దాపురం ఇవ్వాలని కోరగా, చంద్రబాబు ఇప్పటివరకు కూడా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన ఆయన టీడీపీ ని వదిలి వైసీపీ లో చేరనున్నట్లు సమాచారం.