మోదీతో కర్ణాటక సీయం కుమారస్వామి భేటీ

SMTV Desk 2019-03-09 18:44:10  indian prime minister, narendra modi, bjp, karnataka chief minister, kumaraswamy

న్యూఢిల్లీ, మార్చ్ 09: శనివారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కలిశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి విజ్ఞాపణ పత్రాలు అందజేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద ఉన్న పెండింగ్ నిధులను అదేవిధంగా వలసల నివారణకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం కింద వస్తు సమాగ్రి, వేతనాలు అందజేయాల్సిందిగా కోరారు. మొత్తం 176 తాలుకాల్లో 100 తాలుకాల్లో కరువు నెలకొందని కావునా తగిన సాయం చేయాల్సిందిగా ప్రధాని మోడిని కుమారస్వామి కోరారు.