శ్రీకాకుళం, మార్చ్ 09: శ్రీకాకుళం జిల్లా ఆరసవల్లిలో ఆలయంలోని శ్రీ సూర్యానారాయణ స్వామి వారి పాదాలను ప్రతీ సంవత్సరం సూర్య కిరాణాలు మార్చి 9, 10 తేదీల్లో మరియు అక్టోబర్ 1, 2 తేదీలో తాకుతుంటాయి. అయితే ఈ దృశ్యాన్ని చూసేందుకు వేళల్లో భక్తులు అక్కడికి తరలి వస్తారు. ఎప్పుడూ లాగే ఈ ఏడాది కూడా నేడు మార్చ్ 9 కావడంతో అక్కడికి వచ్చిన భక్తులు ఈసారి నిరాశతో వెనుదిరిగారు. ఆలయ పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి స్వామివారి పాదాలను తాకుతుంటాయి. కేవలం 34 నిమిషాలు మాత్రమే ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అయితే ఈ రోజు సూర్య కిరణాలు పడకుండా మేఘాలు అడ్డుపడ్డాయి. రేపు స్వామి వారి మూలవిరాట్ను సూర్య కిరణాలు తాకే అవకాశం ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు.