న్యూఢిల్లీ, మార్చ్ 09: భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఓ అరుదైన గౌరవం దక్కింది. వెంకయ్యనాయుడు చట్టబద్ధపాలన, ప్రజాస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి విషయంలో చేసిన కృషిని గుర్తించిన యూనివర్సిటీ ఆయనకు ఆఫ్ పీస్ గౌరవ డాక్టరేట్ అందించి గౌరవించింది. ఈ గౌరవ పురష్కారాన్ని వెంకయ్య నాయుడు కోస్టారికా రాజధాని శాన్జోస్లో యూనివర్సిటీ డీన్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రపంచంలోని అతి కొద్ది మందికి మాత్రమే ఈ వర్సిటీ డాక్టరేట్ అందించగా అందులో వెంకయ్య ఒకరు. అంతేకాదు, తొలి భారతీయుడు కూడా వెంకయ్య నాయుడే. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత తత్వశాస్త్రం ప్రవచించే వసుధైక కుటుంబం, శాంతి,సామరస్య భావానికి ప్రపంచవ్యాప్తంగా లభించిన గుర్తింపే ఈ డాక్టరేట్ అన్నారు.