తమన్నా పారితోషకం ఎంతో తెలుసా ..

SMTV Desk 2019-03-08 16:52:02  tamannah

యాంకర్ ఓంకార్‌కు దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘రాజుగారి గది’. ఈ చిత్రాన్ని అందరూ చిన్న నటులతో తీసినా అది సంచలన విజయాన్ని సాధించి హార్రర్ జోనర్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. దీంతో ‘రాజుగారి గది 2’ చిత్రాన్ని స్టార్లు నాగార్జున, సమంతలతో తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో ‘రాజుగారి గది 3’ తీస్తానని ప్రకటించిన దర్శకుడు ఓంకార్ ఇప్పుడు ఆ ప్రయత్నాలను సీరియస్‌గానే మొదలుపెట్టాడట. ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకోవాలని ఆమెను సంప్రదించారట. అయితే కథ విని బాగుందని చెప్పిన తమన్నా ఏకంగా కోటిన్నర రెమ్యునరేషన్ అడిగిందట. ఇంతకుముందు 70 లక్షల దాకా పారితోషికం తీసుకున్న మిల్కీ బ్యూటీకి ‘ఎఫ్2’ ఘన విజయంతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ వచ్చింది. దీనికి తోడు మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ చిత్రంలో ఆమె ఓ మంచి పాత్ర చేస్తోంది. ఈ నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. కథ డిమాండ్ చేస్తోంది కాబట్టి తమన్నాకు భారీ పారితోషికాన్ని ఇచ్చేందుకు ఓంకార్ ఓకే చెప్పాడట. గోపీచంద్ సరసన ఓ సినిమాకు సైతం ఆమె భారీ పారితోషికాన్ని అడిగిందని తెలిసింది. మొత్తానికి తమన్నా డిమాండ్ మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.