న్యూ ఢిల్లీ, మార్చ్ 08: పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ ప్రయాణిస్తున్న ఎస్యువి వాహనం రాజ్కోట్-చోటిలా జాతీయ రహదారిపై ఓ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపైన ఉన్న వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా… హార్ధిక కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో హార్దిక్ పటేల్తో పాటు ఆయన సహచరులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై రాజ్కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా హార్దిక్ పటేల్, ఆయన సహచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు స్థానిక సమాచారం. అనంతరం ఇక్కడి నుంచి వేరే కారులో హార్దిక్ పటేల్ అహ్మదాబాద్ వెళ్లారు. అయితే, తాను మార్చి 12న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ హార్దిక్ పటేల్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.