రెండు చోట్ల ఎన్‌కౌంటర్లు...నలుగురు నక్సల్స్ మృతి

SMTV Desk 2019-03-08 11:50:50  Maoists attack in crpf army, jarkhand, kerala, encounter

రాంచి, మార్చ్ 07: ఈ రోజు ఉత్తర, దక్షిణ భారతావనిలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా నలుగురు చనిపోయారు. జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా నలుగురు చనిపోయారని, వారి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉండగా కేరళలోని వైనాడ్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీపీ జలీల్ అనే మావోయిస్టు మృతిచెందాడు. వైతిరి అటీవీ ప్రాంతంలోని ఓ రిసార్ట్ సమీపంలో నిన్న రాత్రి 8 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్ అర్ధరాత్రి వరకు సాగిందని పోలీసులు చెప్పుకొచ్చారు. పదిమందికిపైగా మావోయిస్టులు తమపై కాల్పులు జరిపారని తెలిపారు. జలీల్ సోదరుడు ఇస్మాయిల్ కూడా మావోయిస్టునేనని అతన్ని ఇటీవలే అరెస్ట్ చేశామని వెల్లడించారు.