ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల కోసం వైసీపీ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికలో అధికార ప్రతిపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షం వైసీపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగానే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాని భావిస్తోంది.
దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నం జిల్లాలో ఖారారైన అభ్యర్ధుల జాబితా సోసల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతోంది. ఇక ఈ అభ్యర్ధుల జాబితా చూస్తే.. విశాఖలో దాదాపుగా 9 సీట్లలో క్లారిటీ కనిపిస్తుండగా మిగిలిన స్థానాల్లో స్పష్టత రావాల్సి ఉంది.
అందులో ప్రధానంగా విశాఖ నార్, విశాఖ వెస్ట్, పెందుర్తిలో ఇంకా అభ్యర్ధుల ఖారారు కాలేదు. అలాగే అనకాపల్లి, అరకు, పాయకరావుపేట, స్థానాలు మాత్రం ఇద్దరేసి నేతల మధ్య దోబూచులాడుతూ ఉంది. మరో వారం రోజుల్లో మిగిలిన స్థానాల్లోని అభ్యర్ధులను ఫైనలైజ్ చేయనున్నారు.
## విశాఖపట్నం జిల్లాలో ఖన్ఫర్మ్ అయిన వైసీపీ అభ్యర్ధుల జాబితా..
* అనకాపల్లి – గుడివాడ అమర్ లేదా దాడి రత్నాకర్
* అరకు – శెట్టి లత్సాలు లేదా కంభా రవిబాబు
* భీమిలి – అవంతి శ్రీనివాస్
* చోడవరం – కరణం ధర్మశ్రీ
* గాజువాక – తిప్పల నాగిరెడ్డి
* మాడుగల – ముత్యాల నాయుడు
* నర్సీపట్నం – పి గణేష్
* పాడేరు – భాగ్యలక్ష్మి
* పాయకరావుపేట – పండుల రవీంద్రబాబు లేదా గొల్ల బాబూరావు
* విశాఖ ఈస్ట్ – వంశీ కృష్ణ
* విశాఖ సౌత్ – మళ్ల విజయ్ ప్రసాద్
* యలమంచిలి – కన్నబాబు రాజు