ముంబై, ఆగస్ట్ 6 : బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో "జబ్ హ్యారీ మెట్ సెజల్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ కి జోడీగా అనుష్క శర్మ నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర ప్రచార కార్యక్రమం నిమిత్తం కోల్కతా వెళ్తున్న షారుఖ్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆయన ఆ కార్యక్రమానికి ఆలస్యంగా చేరుకున్నారు. తర్వాత ఆయన అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో ఫోన్ లో మాట్లాడుతూ.. "నేను గాయపడ్డాను, చికిత్స చేయించుకొని వస్తున్న అందుకని ఆలస్యమయింది. ఈ ఆలస్యానికి నన్ను క్షమించండి" అంటూ తెలిపారు. అయితే అసలు షారుఖ్ ఎలా గాయపడ్డారో మాత్రం తెలియరాలేదు.