చెన్నై, ఆగస్ట్ 6 : సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ఇటీవల జరిగిన దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తమిళనాడు సీఎం పళనిస్వామి మాట్లాడుతూ, సినీ నటులు రాజకీయ ప్రకటనలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రజనీపై విమర్శనలను గుప్పిస్తూ, అసలు రాజకీయాలలోకి రావాలనుకునేవారు ముందుగా ప్రజాసేవ చేయాలని, ప్రజల మనసులను గెలవకుండా ఎవరు అందలం ఎక్కలేరని ఎద్దేవా చేసారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి, కాని అమ్మ ఆశీస్సులు ఉన్నంత వరకు తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.