టీడీపీకి గుడ్ బాయ్, వైసీపీలో చేరనున్న సినీనటి

SMTV Desk 2019-03-07 12:43:21  Jayasudha, Jaganmohan Reddy, Chandrababu Naidu, TDP, YCP, Party Changing

అమరావతి, మార్చి 7: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీ లోకి మరో ప్రముఖ వ్యక్తి అడుగు పెట్టనున్నారు. సినీ నటి జయసుధ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం ఆమె వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ని కలవనున్నారు. జగన్ సమక్షంలో జయసుధ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జయసుధకు టిక్కెట్టు రావడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్ది ముఖ్యపాత్ర పోషించారు.

ఆ తరువాత జయసుధ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. గత ఏడాది టీడీపీలో చేరి, చంద్రబాబునాయుడును కలిశారు. తరువాత టీడీపీ కార్యక్రమాల్లో ఆమె ఏనాడూ కూడ క్రియాశీలకంగా పాల్గొనలేదు. తాజాగా ఈరోజు జయసుధ వైసీపీ చీఫ్ తో భేటీ కానున్నారు. జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరనున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.