న్యూఢిల్లీ, మార్చ్ 06: భారత జట్టు ఆటగాడు మహ్మద్ షమీపై మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా నెహ్రా మాట్లాడుతూ...ప్రస్తుతం భారత జట్టులో షమీ ఒక విలువైన ఆటగాడు అని చెప్పుకొచ్చాడు. త్వరలో జరగనున్న ప్రపంచకప్కు వెళ్లే భారత జట్టులో షమీ కీలకపాత్ర పోషించనున్నాడన్నాడు.
భారత జట్టుకు దొరికిన ఆస్తి షమీ. ఈ మధ్య కాలంలో తన ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉంది. ఎప్పటికప్పుడు తన ఆటతీరుతో షమీ మార్పులు చేసుకుంటున్నాడు. బౌలింగ్లో మెరుగవుతూనే ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అతడిని గమనిస్తున్నాను.
అత్యుత్తమ బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. మరొకవైపు అతని ఫిట్నెస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. కాబట్టి ప్రపంచకప్లో షమీ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆ మెగా టోర్నీలో భారత్కు షమీ విలువైన ఆస్తి అని నెహ్రా పేర్కొన్నాడు.