నాగపూర్, మార్చ్ 05: నేడు ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం చేశాడు. ఈ సెంచరీతో విరాట్ వన్డేలలో 40వ సెంచరీ కావడం విశేషం. 106 బంతుల్లో 100 పరుగులు చేసిన, కోహ్లి వన్డే క్రికెట్లో 40వ శతకాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకూ 223 అంతర్జాతీయ వన్డేలు ఆడిన విరాట్ 59.42 సగటుతో 10,500లకు పైగా పరుగులు సాధించాడు. ఇక ఆస్ట్రేలియాపై 33 మ్యాచ్లు ఆడిన కోహ్లి 7 శతకాలు, 5 అర్ధశతకాలు నమోదు చేశాడు.వన్డేల్లో అత్యధికంగా సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. అతని తర్వాతి స్థానంలో కోహ్లినే ఉండటం విశేషం.