గుంటూరు, మార్చ్ 5: మంగళవారం శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గుంటూరులోని చుట్టుగంట సెంటర్లోగల ఓ హోండా షోరూమ్లో సమావేశమయ్యారు. కొద్ది గంటలపాటు అక్కడ వీరిద్దరు ఏకాంతంగా చర్చలు జరిపారు. అయితే కోడెల, లగడపాటి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరపడం పట్ల పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.