న్యూఢిల్లీ, ఆగష్ట్ 5: ఉపరాష్ట్రపతి ఎన్నికల లెక్కింపు పూర్తి అయ్యింది. ముందుగా అనుకున్నట్లే అత్యధిక మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి వెంకయ్య నాయుడు గోపాలకృష్ణగాంధీపై గెలుపొందారు. మొత్తం ఓట్లలో వెంకయ్యనాయుడికి 516, గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 11న భారత 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ హన్సారీ పదవి కాలం 10తేదీన ముగియనుంది.