న్యూఢిల్లీ, ఆగష్ట్ 5: ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు విశాఖ పెట్రోలియం వర్సిటీని ఇప్పటికే తాత్కాలిక క్యాంపస్లో ప్రారంభించారు. అయితే తాజాగా శుక్రవారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపీఈ) బిల్లు– 2017ను ప్రవేశపెట్టగా సభలోని సభ్యులంతా ఆమోదం తెలిపారు. ఇప్పటికే ప్రారంభమైన ఐఐపీఈకి జాతీయ ప్రాధాన్య, స్వతంత్ర సంస్థగా గుర్తింపునిస్తూ వర్సిటీని ఇన్ కార్పొరేట్ చేసేందుకు గానూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ వర్సిటీ కోసం ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల స్థలమిచ్చిందని సభ్యులకు తెలిపారు.