రైలు కాంటీన్ భోగీలో మంటలు

SMTV Desk 2019-03-05 12:36:10  East Godavari, Fire Accident in train

తూర్పు గోదావరి, మార్చి 05: తూర్పు గోదావరి జిల్లాలోని యశ్వంత్ పూర్ నుంచి టాటానగర్ వెళ్ళే రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. గొల్లప్రోలు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు లోని కాంటీన్ భోగిలో మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే చైన్ లాగి రైలుని ఆపి ప్యాంట్రికారు భోగిని రైలు నుంచి వేరు చేయడంతో ప్రమాద తప్పింది.

తర్వాత రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ప్రమాదం వల్ల రైలు రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో విజయవాడ-విశాఖ మద్య పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి.