మహర్షి సినిమా పై మహేష్ ఫాన్స్ ఫైర్

SMTV Desk 2019-03-04 18:55:59  Mahesh Fans, Maharshi,

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో “మహర్షి” చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసినదే..అసలు ఎప్పుడో మొదలు పెట్టేసిన ఈ సినిమా నుంచి మాత్రం ఒక్క అప్డేట్ కూడా సక్రమంగా లేదు.భరత్ అనే నేను విడుదలయ్యి సంవత్సరం దగ్గర కావస్తున్నా మహర్షి టీమ్ నుంచి ఒక్క టీజర్ కూడా వదల్లేదు.దీనితో సోషల్ మీడియాలో ఇన్ని రోజులు ఓపిక పట్టిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు మరియు నిర్మాణ సంస్థలపై ఫైరవుతున్నారు.

ఇప్పటి వరకు కనీసం ఒక్క టీజర్ కూడా వదల్లేదు అసలు ఏం జరుగుతుంది అని మండిపడుతున్నారు.ఇప్పుడు తాజాగా ట్విట్టర్ ను ఊపేస్తున్నారు.అప్డేట్ ఇస్తున్నారా లేదా అంటూ తెగ ట్వీట్లు పెట్టేస్తున్నారు.మరికొంత మంది అభిమానులు అయితే ఇతర నిర్మాణ సంస్థలను చూపించించి వీరిని చూసైన బుద్ధి తెచ్చుకోండి అంటూ ట్రోల్ల్స్ కూడా వేస్తున్నారు.ఎక్కువ కాలం ఆలస్యం కావడం వల్ల అభిమానులు చేతిలో ఇప్పుడు వంశీ కూడా బలైపోయారు..మరి వీరందరి కోరిక మేరకు ఇప్పుడే టీజర్ విడుదల చెయ్యకపోయినా కనీసం ఎప్పుడు విడుదల చేస్తారో ఆ డేట్ చెప్తే కొంచెం అయినా వారు శాంతిస్తారో లేదో చూడాలి.