జగన్ పై గంటా ఘాటైన విమర్శలు

SMTV Desk 2019-03-04 16:31:32  Ganta, Srinivas Rao,

తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు జరిగినటువంటి ఒక మీటింగులో వైసీపీ పై తీవ్ర స్థాయి విమర్శలు చేసారు.ఇన్ని రోజుల వరకు వైసీపీ ఓట్లను టీడీపీ తీసేస్తుందని ఆరోపిస్తుంటే ఇప్పుడు వైసీపీ వారు తమ పార్టీకి చెందిన కార్యకర్తల ఓట్లు తీసేస్తున్నారని ఆరోపిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భయం మొదలయిందని,అందుకనే తమ పార్టీ ఓట్లు తీయించేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ చేస్తున్న నీచ రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు.

వైసీపీ వారు తీయించిన ప్రతి ఒక్క ఓటు న్యాయబద్దంగా మళ్ళీ ఓటర్ లిస్ట్ లో పెట్టే విధంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఈ సమయంలోనే వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై గంటా కొన్ని ఘాటైన విమర్శలు చేసారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తమవ్వాలని ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చెయ్యబోయే పార్టీల యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలని మొన్న నేషనల్ మీడియా వారు జగన్ ను ఒక ఇంటర్వ్యూ చేసారని ఆ ఇంటర్వ్యూ మొదటిలో జగన్ ను ఉద్దేశించి వారు చెప్పిన మాటలను చూస్తే ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి,అనేక అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి ఒక పక్క పాదయాత్రలు చేస్తూ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరువుతాడు అని పరిచయం చేసారని సంచలన వ్యాఖ్యలు చేసారు.