పరిస్తితులను ఆసరాగా చేసుకొని మోదీ వైఫల్యాలు దాస్తున్నారు : మాయావతి

SMTV Desk 2019-03-04 16:11:41  bahujana samaj party chief mayavati, bjp, narendramodi, pulwama attack, pakistan

లక్నో, మార్చ్ 3: ఆదివారం లక్నోలో బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతి ఓ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ...భారత ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి తరువాత దేశం మొత్తం ఆందోళన చెందుతుందని ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ప్రధాని మోదీ వైఫల్యాలు దాస్తున్నారన్నారు. బీజేపీ కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తోందని అన్నారు. అంతేకాక రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితిలో ప్రధాని బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారంటూ మండిపడ్డారు.