మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి

SMTV Desk 2019-03-02 16:22:57  MP JC Divakar reddy, TDP, AP Assembly elections, mla

అనంతపురం, మార్చ్ 2: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తనను చూసి ఓట్లేస్తారని భావిస్తున్నారని కానీ అది అసాధ్యం అన్నారు. చేసేదంతా ఎమ్మెల్యేలు అయితే చంద్రబాబు నాయుడును ఎవరు చూస్తారంటూ చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని స్పష్టం చేశారు. మార్చితేనే చంద్రబాబు రాజ్యం వస్తుందని లేకపోతే కష్టమేనన్నారు. ఈ మధ్యే 40 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలంటూ చంద్రబాబును కలిశారు. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తొలుత అనంతపురం పార్లమెంట్ పరిధిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి ఈసారి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలంటూ వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుబులు రేగుతోంది.