కల్యాణ్ రామ్ హీరోగా గుహన్ దర్శకత్వంలో రూపొందిన '118' నిన్ననే విడుదలైంది. ఈ చిత్రంలో కథానాయికలుగా నివేదా థామస్, షాలినీ పాండే నటించారు. కాగా, ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

SMTV Desk 2019-03-02 14:08:05  Shivaji, YCP, TDP, Modi

అమరావతి, మార్చి 02: నటుడు శివాజీ మరోసారి వైసీపీ అధినేత జ‌గ‌న్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ గేమ్స్ ఆడుతోంద‌ని శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా విష‌యంలో వైసీపీ మోదీని ఎందుకు ప్ర‌శ్నించ‌డంలేద‌ని శివాజీ అడిగారు. సోష‌ల్ మీడియాలో వెబ్‌సైట్‌ల‌లో దాదాపు 70 శాతం వైసీపీవేన‌ని శివాజీ తెలిపారు.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం విశాఖకు ప్రకటించిన రైల్వే జోన్ పై స్పందిస్తూ.. వేరుశెన‌గ‌కాయ పంట పండింది కానీ, దానిలో విత్త‌నాలు లేవ‌ని శివాజీ సెటైర్ వేశారు. మోదీకి మిత్రులు ఎవ‌రైనా త‌మ‌కు శ‌త్రువుల‌ని శివాజీ స్ప‌ష్టం చేశారు. ఏపీలో మ‌రోసారి అధికారంలోకి తెలుగుదేశం పార్టీనే వ‌స్తుంద‌ని, మ‌రోసారి ముఖ్య‌మంత్రి అయ్యేది చంద్ర‌బాబే అని శివాజీ జ్యోస్యం చెప్పారు. జ‌గన్ సీయం ఆశ‌లు నెర‌వేర‌వ‌ని, జ‌గ‌న్ కోరిక క‌ల‌గానే మిగిలిపోతుంద‌ని శివాజీ తేల్చి చెప్పారు.