నాకు ముందే తెలుసు: పవన్ కళ్యాణ్

SMTV Desk 2019-03-02 12:05:37  Pawan Kalyan, Estimated, War, Bharath, Pak

అమరావతి, మార్చి 2: ఇండియా-పాకిస్థాన్ ల మధ్య యుద్ధం రాబోతోందంటూ గతంలో కొందరు బీజేపీ నేతలు చెప్పారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో యుద్ధానికి తెరతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మాటలు జాతీయ మీడియాతో పాటు పాకిస్థాన్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. తాజాగా ఈ వ్యవహారంపై జనసేన పార్టీ స్పందించింది.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన జాతీయ మీడియాకు తెలిపింది. ఈ విషయం పట్ల ప్రజలను తప్పుడు దారి పట్టించావద్దని వెల్లడించింది. ఈ సందర్భంగా గత నెల 28న ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "యుద్ధం వస్తుందని పాకిస్థాన్ వాళ్లు మాట్లాడుకుంటుంటే నేనేమన్నా విన్నానా? అంతర్జాతీయ సంస్థ లేమన్ బ్రదర్స్ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని కొందరు నిపుణులు ముందుగానే అంచనా వేశారు.

భారత్ పాకిస్థాన్ ల మధ్య యుద్దం రాబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఇంటర్నెట్ లో కథనాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ రాజకీయాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇరుదేశాల మధ్య యుద్ధం రాబోతోందన్నది నా అంచనా కాదు. కొందరు రాజకీయ పరిశీలకుల అంచనా మాత్రమే" అని జనసేనని చెప్పారు.