ఆంధ్రప్రదేశ్, మార్చి 01: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఆంధ్ర ప్రజలు కేంద్రం తీరుపై సంతృప్తిగా లేరని భావించిన కేంద్రం, ఈ పర్యటనకు ముందు రైల్వే జోన్ ను ప్రకటించి కేంద్రం ప్రజల ఆగ్రహాన్ని కాస్త చల్లార్చే ప్రయత్నం చేసింది. అయితే నేడు విశాఖలో జరిగే సభలో మోదీ ప్రజలపై మరిన్ని వరాలు కురిపించానున్నడా ? లేక ఎప్పటిలాగానే చంద్రబాబుపై విమర్శలు చేయనున్నాడా ? అనేది చూడాల్సి ఉంది.
ప్రధాని పర్యటనపై టీడీపీ మరోసారి భగ్గుమంది. ఈ పర్యటనను అడ్డుకోవడానికి టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. మోదీ గో బ్యాక్ అనే నినాదంతో నిరసన్ కార్యక్రమాలు చేపట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు నిరాహారదీక్షకు దిగారు. అలాగే, మోదీకి దారి పొడవునా నల్లజెండాలతో నిరసన తెలియజేయనున్నట్టు సాధన సమితి తెలిపింది.