బెంగళూరు, ఫిబ్రవరి 28: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్స్ట్రైక్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు సహాయపడుతోందని యెడ్యూరప్ప వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ దేశంలోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన చేసిన దాడుల వల్ల వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా మారిందన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎయిర్స్ట్రైక్ వల్ల 22 లోక్సభ సీట్లను కైవసం చేసుకుంటుందని యెడ్యూరప్ప జోస్యం చెప్పారు. పాకిస్థాన్ పై భారత వాయుసేన దాడితో యువత సంతోషంగా ఉన్నారని, వారంతా నరేంద్రమోదీవైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో 28 లోక్ సభ స్థానాలుండగా ప్రస్థుతం బీజేపీ సభ్యులు 16 మంది ఉన్నారు. కాంగ్రెస్ 10, జనతాదళ్ కు ఇద్దరు సభ్యులున్నారు. ఎయిర్స్ట్రైక్ వల్ల బీజేపీకి 22 సీట్లు వస్తాయని యెడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు.