త్వరలో గజ్వేల్‌ ప్రజలకు రైలు సదుపాయం

SMTV Desk 2019-02-28 18:49:55  Gajwel, Railway construction deputy chief engineer subrhamanyam, cm kcr, trs

గజ్వేల్‌, ఫిబ్రవరి 28: గజ్వేల్‌ ప్రాంత ప్రజలకు జులై నెలలోగా రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకోస్తామని రైల్వేశాఖ కన్‌స్ట్రక్షన్‌ విభాగం డిప్యూటి చీఫ్‌ ఇంజినీర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

మనోహరాబాద్ గజ్వేల్ మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, రెవెన్యూ అధికారులు భూసేకరణ పూర్తి చేయడంతో ఇబ్బందులు తొలిగిపోయి నిర్మాణ పనుల్లో వేగం పుంజుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరువతో జరుగుతున్న రైల్వేట్రాక్ నిర్మాణ పనులు మరో రెండునెలల్లో పూర్తి చేయడంతోపాటు రైలు ప్రయాణానికి అవసరమైన అన్నిఏర్పాట్లు జూన్ చివరిలోగా పూర్తి చేస్తామన్నారు. గజ్వేల్ మండలం గిరిపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి, ట్రాన్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులు, కంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు.