అమరావతి, ఆగష్టు 4: నంద్యాల ఉపఎన్నికలు ఊపందుకున్న నేపధ్యంలో వైసీపీ, తెదేపా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గురువారం నంద్యాలలో జరిగిన బహిరంగసభలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మాట్లాడిన మాటలను తెదేపా మంత్రి పరిటాల సునీత తప్పుపట్టారు. జగన్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని, కాల్చి చంపడమే ఆయన సంస్కృతి అని, ఆ సంస్కృతే తన భర్త పరిటాల రవిని హత్య చేయించిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్త పరిటాల రవిని హత్య చేయించింది జగన్, ఆయన తండ్రి కాదా? నా భర్తతో పాటు ఎందరినో బలి తీసుకున్నారు. మా నాయకుడు చంద్రబాబు హత్యా రాజకీయాలకు వ్యతిరేకం. ఆయన గురించి మాట్లాడేటప్పుడు జగన్ నోరు అదుపులో పెట్టుకోవాలి అని సునీత మండిపడ్డారు.