న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎగిసాయి. పెట్రోల్ ధర 7 పైసలు, డీజిల్ ధర 8 పైసలు పెరిగింది. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.73 వద్ద.. డీజిల్ ధర రూ.67.00 వద్ద కొనసాగుతున్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.77.36 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.70.18 వద్ద ఉంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర 76 మార్క్ పైనే కదలాడుతోంది. రూ.76.12 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.72.85 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.75.87 వద్ద, డీజిల్ ధర రూ.72.19 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మిశ్రమంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.09 శాతం క్షీణతతో 66.52 డాలర్లకు తగ్గింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.02 శాతం పెరుగుదలతో 56.95 డాలర్లకు ఎగసింది.