దీని కంటే చిలక జోస్యం నేర్చుకోవడం మేలు

SMTV Desk 2019-02-28 15:37:37  Raghuveera Reddy, Undavalli Arunkumar, Rahul Gandhi, AICC, AP PCC

అమరావతి, ఫిబ్రవరి 28: ఆంధ్రప్రదేశ్ పీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాల్లేవని ఏ ప్రాతిపదికన ఉండవల్లి చెప్పారని ధ్వజమెత్తారు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం కంటే చిలక జోస్యం, హస్తసాముద్రికంలు నేర్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

ఈ మధ్యే జరిగిన ఓ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశాల్లేవని ఉండవల్లి వ్యాఖ్యానించగా, దీనిని రఘువీరారెడ్డి ఖండించారు. ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు.