అమరావతి, ఫిబ్రవరి 28: భారత్ వాయుసేనకు చెందిన మిగ్21 విమానం బుదవారం ఉదయం పాక్లో కూలింది. కాగా, పాకిస్థాన్ సైన్యం భారత పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ ను అదుపులోకి తీసుకుంది. అభినందన్ సురక్షితంగా ఇండియాకి తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆయన మాతృదేశానికి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.