ప్రభాస్, అనుష్కలకు జపాన్ లో ఏం పని..!

SMTV Desk 2019-02-27 17:20:55  prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్వీటీ అనుష్కల మధ్య సంథింగ్ సంథింగ్ అన్న వార్తలు సర్వసాధారణం. ఇద్దరు కలిసి కనిపిస్తే చాలు ఓ వారం, రెండు వారాల పాటు మళ్లీ ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్న విషయం మీద వార్తలు రాస్తారు. మా ఇద్దరి మధ్య మీరనుకునే రిలేషన్ ఏమి లేదని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ అలాంటి వార్తలే వస్తాయి.

ఇక లేటెస్ట్ గా ప్రభాస్, అనుష్క ఇద్దరు కలిసి జపాన్ వెళ్లడంపై మరోసారి మీడియా వారిపై ఫోకస్ పెట్టింది. ఇంతకీ ఈ ఇద్దరు ఎందుకు జపాన్ వెళ్తున్నారు అంటే ఇద్దరు కలిసి చేసిన మిర్చి సినిమా అక్కడ రిలీజ్ చేస్తున్నారట. బాహుబలితో అక్కడ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, అనుష్క ఇద్దరు కలిసి నటించిన సినిమా కావడంతో మిర్చి సినిమాను జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు.

అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు వీరిద్దరు అక్కడకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తారట. మార్చి 2న మిర్చి జపాన్ లో రిలీజ్ అవుతుంది. ఇదే కాదు ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.